30 June, 2026 | 9:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం

17-01-2026 04:00 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు

ముషీరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్  బాకారంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంభ  మల్లికార్జున స్వామి(మల్లన్న) కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మాజీ ఎంపీ వి.  హనుమంతరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస రావు, నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్, రాజా దీన్ దయాల్ రెడ్డి, ఎ.  శంకర్ గౌడ్, నందగిరి నరసింహ తదితరులు కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ  అంజిరెడ్డి దంపతులు  స్వామి వారికి శాంతి బోనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ సీఐ రాంబాబు ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో అగ్నిగుండంలో ప్రవేశం, గొలుసుని  తెంపుట తదితర పూజా కార్యక్రమాల నిర్వహించారు.