14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

13-12-2025 12:51 AM

తుర్కయంజాల్, డిసెంబర్ 12: తుర్కయంజాల్ సర్కిల్లో పనిచేస్తున్న 48మంది కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. రాగన్నగూడలోని వార్డు కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం కాంట్రాక్టు పద్ధతిన 48మంది కార్మికులను నియమించుకున్నారని, వీరికి మూడునాలుగు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారన్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కార్మికులకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్ పట్ల వెంటనే స్పందించిన డీసీ సత్యనారాయణరెడ్డి పెండింగ్ వేతనాలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కిషన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ, నాయకులు ఎ. మాధవరెడ్డి, కార్మికులు నార్లకంటి సాలయ్య, గోపాల్, ప్రవీణ్, సుధాకర్, చెక్క స్వప్న, మల్లెల జయ, యశోద, మంజుల, విష్ణు, రాధిక, లలిత, యాదమ్మ,, దీవెన, జ్యోతి, సంజయ్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.