28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు

03-11-2025 08:13 PM

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు..

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్ డబుల్ బెడ్ రూమ్ లలో అధికారులు, నాయకులు స్థానికులకు కాకుండా డబ్బులకు డబుల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన పట్టాదారులకు శాపంగా మారింది. పట్టాదారులకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న విధంగా ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజమైన పట్టదారులమైన మాకు ఇంటి నెంబర్, కరెంటు మీటర్ ఇప్పించి న్యాయం చేయగలరని బాధితులు కోరుకుంటున్నారు.