17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు

03-11-2025 08:13 PM

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు..

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్ డబుల్ బెడ్ రూమ్ లలో అధికారులు, నాయకులు స్థానికులకు కాకుండా డబ్బులకు డబుల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన పట్టాదారులకు శాపంగా మారింది. పట్టాదారులకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న విధంగా ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజమైన పట్టదారులమైన మాకు ఇంటి నెంబర్, కరెంటు మీటర్ ఇప్పించి న్యాయం చేయగలరని బాధితులు కోరుకుంటున్నారు.