15 March, 2026 | 7:39 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ ఇండ్లు ఇవ్వాలి

30-01-2026 12:13 AM

గాంధీనగర్  కార్పొరేటర్ ఎ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం  గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద నగర్ బస్తీ లోని19 మంది దళిత కుటుంబాల ఇళ్లను కూల్చి 2 సంవత్సరాలు పూర్తున ఇప్పటివరకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించలేదని,  బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ అలాట్మెంట్ చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమా ర్ అన్నారు.

ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ లోని వివేకానంద బస్తీ లో ఇండ్లు కూల్చేసి 2 సంవత్సరాలు పూర్తున సందర్భంగా బస్తీ వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని బాధితులకు మద్ధతు పలికారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ నేతలు అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి సంతోష్, తరుణ్, డేవిడ్, బస్తీ వాసులు ఎన్ ఆర్ యాదగిరి, శ్యామ్ సుందర్, గ్యాణేష్, ఆనంద్ రావు, సాయి కిరణ్, మున్న, మనోహర్, అన్నపూర్ణ, చంద్రకల, సుశీల తదితరులు పాల్గొన్నారు.