4 July, 2026 | 11:12 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మరో మూడు రోజులు భగ భగ!

23-04-2025 12:00 AM
  1. 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ కేంద్రం

మంగళవారం 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మంగళవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గమనార్హం. రాబోయే మూడు రోజులు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే సాయంత్రానికల్లా ఉరుములు, పిడుగులతో కూడిన చిరుజల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా అతి తక్కువగా హైదరాబాద్‌లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 41.6 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.