13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

09-01-2026 10:20 AM

మిర్యాలగూడలో ప్రమాదం: ముగ్గురు దుర్మరణం 

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని(Nalgonda district) మిర్యాలగూడ బైపాస్‌పై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ బైపాస్ రోడ్డుపై(Miryalaguda Bypass Road) మలుపు తిరుగుతుండగా వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం సిమెంట్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఢీకొన్న ఘటన ప్రభావం తీవ్రంగా ఉండటంతో, ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి(Miryalaguda Area Hospital) తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. మృతులను బీహార్ కు చెందిన బీరు బాయ్(30), సంతోష్(30), సూరజ్(18)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో సిమెంట్ ట్యాంకర్ గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు ప్రయాణిస్తోంది. డీసీఎం శంషాబాద్ నుంచి మార్బుల్స్ తో గుంటూరు వైపు వెళ్తోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టోమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.