09-08-2025 07:50:02 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలంలో ప్రజలు రాఖీ(Raksha Bandhan) పౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ముల ప్రేమానురాగాల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ అక్కా చెల్లెల్లు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి, మిఠాయిలు తీనిపించుకొని ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. రాఖీ పౌర్ణమికి గుర్తుగా ఇన్స్యూరెన్స్ బహుకరించడం జరిగింది, ఇన్స్యూరెన్స్ ప్రాముఖ్యతనూ వివరించడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ చాలా అవసరమని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్స్ బిల్స్ చుస్తే భయం వేస్తుంది, అందుకని ప్రతి ఒక్కరు వచ్చే రాఖీ పౌర్ణమి వరకు ఇన్స్యూరెన్స్ చేసుకోవాలని కోరారు.