30-12-2025 01:12:56 AM
ఇల్లందు టౌన్, డిసెంబర్ 29,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా ఒక సంవత్సరం పాటు ఫిట్టర్, ఎలక్ట్రిషియన్గా శిక్షణ పొందిన అప్రెంటిస్లకు వర్క్ షాప్ డివిజనల్ ఇంజనీర్ నాగరాజు నాయ క్ ఆధ్వర్యంలో సోమవారం ట్రేడ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అభ్యర్థులు శిక్షణ కాలంలో నేర్చుకు న్న నైపుణ్యాలను భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ రంగ ప్రవేశ పరీక్షల్లో ఉపయోగించి మంచి ఫలితాలు సాధించి సింగరేణి సం స్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ కల్వోటి యా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్ నా యక్, సీనియర్ ఫోర్మన్ పి.యుగేందర్, సీనియర్ టెక్నీషియన్లు ఎండి.నజీర్ అహ్మద్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.