15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

02-01-2026 12:00 AM

ప్రజల భద్రతే ఆర్టీసీ లక్ష్యం

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, జనవరి 1(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపోలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ట  ప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.

మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సద స్సు లు, శిక్షణా కార్యక్రమాలు, స్కూల్-కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత, పనిచేసే వర్గం ప్రభావితమవుతున్న నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.