24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

02-01-2026 12:00 AM

ప్రజల భద్రతే ఆర్టీసీ లక్ష్యం

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, జనవరి 1(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపోలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ట  ప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.

మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సద స్సు లు, శిక్షణా కార్యక్రమాలు, స్కూల్-కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత, పనిచేసే వర్గం ప్రభావితమవుతున్న నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.