15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చంచల్‌గూడ జైలుకు తరలింపు

07-05-2025 12:24 AM

హైదరాబాద్, మే 6: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సహ నలుగురు దోషులను చంచల్‌గూడ జైలుకు తరలించా రు. కోర్టులోనే వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. కాగా, తీర్పు నేపథ్యంలో తనకు శిక్ష తగ్గించాలని న్యాయమూర్తికి గాలి జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించాలని కోరారు.

దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీకు పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు? యావజ్జీవ శిక్షకు మీరు అర్హులు’ అని అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించారు.