02-05-2025 01:21:32 AM
కొండాపూర్, మే 1 : పహాల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమాన్ని నిరసిస్తూ అనంతసాగర్ లో తాజా మాజీ ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుల మాతాలకు అతీతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైంద న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.