15 April, 2026 | 12:19 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గురు తేగ్ బహద్దర్ సాహిబ్ జీకి ఘనంగా నివాళులు

25-11-2025 08:15 PM

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల లోని స్థానిక గురుద్వారాలో మంగళ వారం  శ్రీ గురు తేగ్ బహద్దర్ సాహిబ్ జీ 350వ  వర్ధంతిని స్థానిక శిక్కులు శబద్ బాణీ కీర్తనలుతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురు ధర్మ ప్రచార పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బహదూర్ సింగ్ మాట్లాడుతూ కాశ్మీర్ హిందూ పండితులు భారతదేశ  హిందువులను, మా ధర్మ రక్షణ మీ ధర్మ సంస్థ (శిక్కుమతం) తోటే సాధ్యం అని శిక్కు మతధర్మ పీఠం తొమ్మిదవ గురువుగా ఉన్న శ్రీ గురు తేగ్ బహద్దర్ సాహిబ్ జీ వద్ద శరణు వేడితే  ధర్మ పక్షమైన హిందువుల కోసం నిలబడి ఆనాటి పాలకుల నుండి హిందువులను కాపాడిన మానవతవాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంత్ సింగ్, ప్రేమ్ సింగ్, కుల్దీప్ సింగ్,పరమేశ్వర్ సింగ్, సికిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.