16 April, 2026 | 10:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇద్దరు గంజాయి విక్రయదారుల అరెస్టు

08-05-2025 12:44 AM

-వాహనం సీజ్

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి): ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బీ టీమ్ సభ్యులు, ముషీరా బాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ముషీరాబాద్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బి టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్త్స్ర శ్రీనివాస్, స్టేషన్ పరిధిలో లాలాగూడ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై అనుమాన స్పదంగా తిరుగుతున్న శివరాం (24), మహేందర్ (25)లను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకోని తనిఖీ నిర్వహించగా వారి వద్ద 1.2 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నామోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేశామని సీఐ రామకృ ష్ణ తెలిపారు.