11 April, 2026 | 3:59 PM

Breaking News

మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం   •   కేబుల్ న్యూస్ ఛానల్ వారు దరఖాస్తు చేసుకోవాలి   •   కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

14-12-2025 12:10 AM
  1. ఆదివారం జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న యువకులు
  2. హైదరాబాద్ జాతీయ రహదారిపై రాఘవాపూర్ వద్ద ఘటన
  3. హనుమకొండ జిల్లా నందనంకి చెందిన వారిగా గుర్తింపు

మహబూబాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యరు. ప్రాథమిక సమాచారం మేరకు హనుమకొండ జిల్లా అయిన వోలు మండలం నందనం గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాదు నుంచి ద్విచక్ర వాహనంపై వీరు వెళ్తున్నారు.

వరంగల్  జాతీయ రహదారిపై రాఘవాపూర్ వద్దకు రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్క డికక్కడే దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామానికి చెందిన కళ్యాణ్, నవీన్ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.