15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మధాపూర్‌లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

16-10-2025 02:31 AM

శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థు లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రీన్‌ఫీల్డ్ స్కూల్లో చదువుతున్న మెడిశెట్టి శ్యామ్ సూర్య వెంకటేష్ (14), రామేశ్వరం సాయి స్వదీప్ (14) అనే బాలురు ఇద్దరూ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందో ళన చెందుతున్న ఘటన మధాపూర్ ప్రాం తంలో చోటుచేసుకుంది.

వెంకటేష్ అక్టోబర్ 14న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, ట్యూషన్‌కు వెళ్తానని చెప్పి స్కూల్ బ్యాగ్‌తో పాటు కొన్ని దుస్తులు తీసుకొని 5 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయాడు. అయితే అదే ట్యూషన్ వెళ్లే అతని సోదరి వెంకటేష్ అక్కడికి రాలేదని, అదే తరగతిలో చదువుతున్న అతని స్నేహితుడు రామేశ్వరం సాయి స్వదీప్ కూడా ట్యూషన్‌కు వెళ్తా అంటూ ఇంటి నుంచి బయలు దేరి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది.

ఇద్ద రూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమోనని కుటుం బ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రారంభం చుట్టుపక్కల గాలించినా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మధాపూర్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు బాలురు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. వారిద్దరి ఆచూకీ తెలిసిన వారు మధాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు, కుటుంబ సభ్యులు కోరారు.