13 July, 2026 | 9:51 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య

04-08-2025 12:00 AM

బోథ్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కడుపు నొప్పి భరిం చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన  చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి తెలిపిన వివరాల ప్రకారం బోథ్ పట్టణానికి చెందిన దాసరి లక్ష్మారెడ్డి (76) అనే రైతు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడన్నారు.

గతంలో అతనికి అపెండిక్స్ ఆపరేషన్ కూడా జరిగింది. అయితే గత రెండు రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి కారణంగా మనో వేదనకు గురయ్యాడు. దింతో ఆదివారం ఉదయం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.