15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

యూనిటీ మార్చ్ ర్యాలీని విజయవంతం చేయాలి

29-10-2025 06:58 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ఈ నెల 31న మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నిర్వహించే యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని యూనిటీ మార్చ్ జిల్లా ఇన్చార్జి గుజ్జ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లో పశ్చిమ జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి కన్వీనర్ అధ్యక్షతన బూత్ ఆ పై స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 31న నిర్వహించే యూనిటీ మార్చుకు పశ్చిమ జోన్ నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కోమాల ఆంజనేయులు, బేతి మహేందర్ రెడ్డి , ఎన్నం ప్రకాష్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, బండారి శ్రీనివాస్, రాగి సత్యనారాయణ, ఈరెడ్డి తిరుమలరెడ్డి, రాయదుర్గం సోమశేఖర్, ఓదెల చందర్, అనుమాల సంపత్, తదితరులు పాల్గొన్నారు.