17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మఠంపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడి అకాల మరణం

14-12-2025 07:16 PM

మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం మఠంపల్లి గ్రామానికి చెందిన ఉన్నూర్ చిన్నభూషి అనే భవన నిర్మాణ కార్మికుడు ఆదివారం అకాల మరణం చెందిన విషయం తెలిసిన వెంటనే భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆయన నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతునికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబానికి సంఘం తరఫున రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సంఘం నాయకులు భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో సిఐటియు సూర్యపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన చిన్నభూషి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడికి రావలసిన సంక్షేమ భీమా తదితర ప్రయోజనాలు తక్షణమే కుటుంబానికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, ఉపాధ్యక్షుడు మాడుగుల నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కందుల నాగలక్ష్మి, కోశాధికారి మామిడి నాగరాజు, కాంతమ్మ, వెంకటమ్మ, సాయమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.