8 July, 2026 | 8:27 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

వాగేశ్వరి అధ్యాపకులు కుందేటి సత్యనారాయణకు రెండు బంగారు పతకాలు

08-11-2025 07:16 PM

కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో వాగేశ్వరి డిగ్రీ & పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు కుందేటి సత్యనారాయణ రెండు బంగారు పతకాలను గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించడం సత్యనారాయణ ప్రతిభ, శ్రమ, క్రమశిక్షణ, విద్యాపట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యంగా తెలుగు అధ్యాపకుడిగా విద్యార్థుల్లో భాషా పట్ల ఆసక్తి పెంపొందిస్తూ, బోధనలో నాణ్యతను పెంచుతూ, అనేక మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయనతో పాటు కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్న గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, సీనియర్ అధ్యాపకులు వెంకట్ రెడ్డి, రమణ చారి, ప్రసాద్, తదితరులు సత్యనారాయణను అభినందించారు.