27-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 26 (విజయ క్రాంతి): గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భాధితుల సమస్యల సత్వర పరి ష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధి తులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.