10 April, 2026 | 3:25 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

విజయ్ పగటికలలు కంటున్నారు !

08-11-2025 01:03 AM
  1. ఇప్పటికే సీఎం అయ్యారనుకుంటున్నారు
  2. ఆయన ఆశలన్నీ ఎండమావులని ఎన్నికల్లో తేలుతుంది
  3. ఎండీఎంకే అధినేత వైగో 

చెన్నై, నవంబర్ 7:  తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తనకు అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని మరములార్చి ద్రావిడ మున్నెట్ర కళగం (ఎండీఎంకే) అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీవీకే, -డీఎంకే మధ్యే ఉంటుందా..? అని శుక్రవారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

విజయ్‌కి రాజకీయాల్లో కనీసం ఓనమాలు కూడా తెలియ వని, గాల్లో మేడలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయినట్లు.. తనకు తానే భావిస్తున్నారని విమర్శించారు. సముద్రాన్ని పేపరు పడవ ఈదాలని చూడటం మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఆయన కలలన్నీ చివరకు ఎండమావులవుతాయని గుర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.

కరూర్ తొక్కిస లాట బాధిత కుటుంబాలను ఓ రిసార్టుకు ఆహ్వానించడంపై వైగో మండిపడ్డారు. బాధిత కుటుంబాలను వారి నివాసాల్లోనే పరామర్శించకుండా, రిసార్టుకు పిలిపించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం చూడలేదని, అది ఒక కుట్ర అని ఆరోపించారు. గతంలో తూత్తుకుడిలో నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోతే.. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి తాను స్వయంగా పరామర్శించానని గుర్తుచేశారు.