17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వరంగల్, హనుమకొండను ఒకే జిల్లాగా కొనసాగించాలి

03-01-2026 08:46 PM

తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ ను గత పాలకులు ఆరు ముక్కలుగా విభజించారని అంతేకాకుండా వరంగల్, హనుమకొండ ను పాలన సౌలభ్యం కోసం రెండు వేరు వేరు జిల్లాలుగా చేస్తున్నామని చెప్పారని కానీ అదేమీ జరగలేదని అందువల్ల వరంగల్, హనుమకొండ ను ఒకే జిల్లాగా కొనసాగించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గత పాలకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాల పాలనలో అన్యాయం జరిగిందని అనేక విధాలుగా ప్రజలను, విద్యార్థులను, ఉద్యోగులను మోసం చేశారని అన్నారు.

హైదరాబాద్ మహానగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రెండవ అతిపెద్ద నగరం అని అన్నారు. చారిత్రాత్మక నగరమైన హనుమకొండ, వరంగల్ ను ఒకే జిల్లాగా ఉంటే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయని వాటి వల్ల నిరుద్యోగ, ఉపాధి అవకాశం వస్తాయని, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందని, సకల అభివృద్ధికి జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం లోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ, వరంగల్ ను ఒకే జిల్లాగా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, జావిద్, టీజేఎస్ నాయకులు శ్రీనివాసపతి, ప్రభాకర్, రాధా కిషన్, కుమ్మరి రాజు, ఆలీ, వెలిశాల రాజేష్, శివ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.