10 May, 2026 | 2:34 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

మహనీయుల బాటలో నడవాలి

09-09-2025 06:53 PM

బీసీ గురుకులాల ఆర్సిఓ శ్రీధర్..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీధర్(Sridhar) అన్నారు. ప్రజా కవి కాళోజి జయంతిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ ఎం జె పి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ భాష దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ యాస భాష అభివృద్ధి కోసం కాలోజీ తినలేని కృషి చేశారని తెలిపారు. ఆయన రచనలతో ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయన రచనలను అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. అంతకుముందు పాఠశాలలోని వంటగదిని స్టోర్ రూమ్ ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుకన్య, ఉపాధ్యాయురాలు, సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.