8 July, 2026 | 5:21 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి   •   ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే   •   పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ   •   ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •  

నమ్మకంతో జర్నీ ప్రారంభించాం

07-08-2025 01:29 AM

‘మ్యాడ్’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక 

శ్రీగౌరీప్రియ. అంతకుముందు ‘మెయిల్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. బ్యాక్‌టుబ్యాక్ ప్రాజెక్టులు ప్రకటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ‘వింటారా సరదాగా’, ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాలున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రాజెక్టుకు తాను సైన్ చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను సైతం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.

‘ప్రతి ఫ్రేమ్ విశ్వాసంతో ప్రారంభమవుతుంది. నమ్మకంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం’ అని పేర్కొంది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడు. శ్రీగౌరీప్రియ.. జీవీ ప్రకాశ్‌కు జంటగా నటిస్తుండగా, ఇందులో అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరియా ఎలాంచెజియన్ దర్శకత్వంలో ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జయవర్ధన్ నిర్మిస్తున్నారు.