23-08-2025 08:30:49 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరుస్తామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. శనివారం నకిరేకల్, కట్టంగూరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే వీరేశం తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు 98% పూర్తి జరిగాయన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.