calender_icon.png 2 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వాంగ సుందరంగా మానుకోట పట్టణాన్ని తీర్చిదిద్దుతా

02-12-2025 02:00:47 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. సోమవారం పట్టణ పరిధిలోని నెహ్రూ సెంటర్ నుండి పత్తిపాక వరకు నూతనంగా ఏర్పాటు చేసిన వీధిలైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 59 కోట్ల 62 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. బంధం చెరువును మరో ట్యాంక్ బండ్ గా మారుస్తానని హామీ ఇచ్చారు.