9 April, 2026 | 8:55 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందించి లబ్ధి చేకూర్చుతా

23-10-2025 10:18 PM

బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి 150 మంది కాంగ్రెస్ లో భారీ చేరికలు..

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి లబ్ధి చేకూర్చుతానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు రాంపటేల్, రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే  కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  మాట్లాడుతూ వజ్రఖండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే గాక గ్రామంలోని హనుమాన్ మందిరం అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం విద్యా, వ్యవసాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తుందని ఎమ్మెల్యే  అన్నారు.ప్రతీ పేదవాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించి లబ్ది చేకూర్చుతానని తెలిపారు.