17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పార్టీలు రిజర్వేషన్ నిర్ణయిస్తే ఎలా?

17-11-2025 12:00 AM

చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ చేయాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, నవంబర్ 16: పార్టీలో రిజర్వేషన్ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎలా సరిపోతుందని చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జెఏసి,బీసీ జాగృతి సేన, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట బద్ధతతో కూడిన 42% రిజర్వేషన్ల సాధనకై సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మద్దతు తెలియజేస్తూబీసీ రిజర్వేషన్ల సాధనకు సంతకం చేశారు.

రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలపై పై ఒత్తిడి తీసుకువచ్చే 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సగర సంగం జిల్లా అధ్యక్షులు ప్రనిల్ చందర్, తదితరులు ఉన్నారు.