17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

వేములవాడలో ఏం జరుగుతుంది?

15-05-2025 02:27 AM
  1. టెంపుల్ మూసివేత అంశంపై మంత్రి కొండా సురేఖ ఆరా

అపోహలు తొలగించి, అభివృద్ధి చేయండి

అధికారులకు మంత్రి ఆదేశం

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): వేములవాడ దేవాలయ మూసివేత అంశంపై జరుగుతున్న ఆందోళనలు, నెలకొన్న పరిస్థితులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. బుధవారం ఈ అంశంపై ఎండోమెంట్ కమిషనర్, వేములవాడ ఆలయ ఈవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెలకొన్నాయని మంత్రికి ఆలయ సిబ్బంది వివరించారు.

భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం, భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నట్లు మంత్రికి చెప్పారు.

అయితే స్థానికంగా అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని మంత్రి సురేఖ సూచించారు. ఎక్కడా ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు.