24 April, 2026 | 6:35 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

‘పార్ట్- భూముల ప్రక్షాళన ఎప్పుడు?

04-08-2024 12:00 AM

భూ వివాదాలు లేని తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన భూప్రక్షాళనవల్ల చాలామంది రైతులకు భద్రతతో కూడిన భూయాజమాన్య హక్కు, పట్టాదారు పుస్తకాలు, పంట సాయం అందించడం ముదవహం. కానీ, ఈ ప్రక్షాళనలో భాగంగా ఇంకా ‘పార్ట్ భూములు పరిష్కారం కాక అలాగే ఉన్నాయి. ఎంతోమంది సంబంధిత రైతులు న్యాయబద్ధమైన పంటసాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రక్షాళన త్వరగా ప్రారంభించి, వివాదాలు ఉన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, న్యాయపరమైన హక్కు కల్పించడం ప్రభుత్వం భాద్యత. వెంటనే ప్రభుత్వం ‘పార్‌ెే్టబి’ భూముల పంచాయతీలను పరిష్కరించేందుంకు చర్యలు తీసుకొని, హక్కుదారులకు పట్టాదారు పుస్తకాలు పంటరుణం మంజూరు చేయాలి.

 వావిలాల రాజశేఖరశర్మ, నాగర్‌కర్నూల్ జిల్లా