calender_icon.png 2 May, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో మహిళ మృతి

01-05-2025 12:59:18 AM

చేవెళ్ల , ఏప్రిల్ 30:  కరెంట్ షాక్ తో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కావాలి బాలామణి (50), వృత్తిరీత్యా కూలీ.

ఏప్రిల్ 20 న గ్రామంలోని  పూజ ఫార్మ్ హౌస్లో కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురైంది. వెంటనే ఆమెను ప్రీమియర్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8:00 గంటల సమయంలో మరణించినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు.  ఈ ఘటనపై ఆమె అల్లుడు చౌదరిగూడెం రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .