25-08-2025 12:00:00 AM
చిట్యాల, ఆగస్ట్ 24: పాముకాటుకు వివాహిత మృతి చెందిన సంఘటన చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన షేక్ షాహిన్(39) రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె ఎడమ కాలుపై పాము కాటు వేసింది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అదే సమయంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. తన భర్త షేక్ సలీం లారీ డ్రైవర్గా పని పనిచేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామ నిర్వహిచామని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు.