03-11-2025 05:16:12 PM
108లో ఆసుపత్రికి తరలింపు..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గంగాపురం గ్రామానికి చెందిన మహిళ రైతు దేశపాక అండాలు(50) వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైంది. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించడంతో ఈఎన్ టి దినేష్, పైలట్ సురేష్ విద్యుత్ షాక్ కు గురైన మహిళను చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.