10 April, 2026 | 3:31 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

బీహార్ ఎన్నికలకు ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లింపు

17-11-2025 12:24 AM
  1. ఎన్డీయే కూటమి మహిళలకు రూ.10వేల చొప్పున నగదు బదిలీ
  2. ఎన్నికలను దెబ్బతీసే విధంగా వ్యవహరించింది
  3. జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఆరోపణ

పాట్నా, నవంబర్ 16 : బీహార్ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించారని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇది ఎన్నికలను దెబ్బతీసేందుకు అనైతిక ప్రయత్నం అని ఎన్డీఏ కూటమిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్ల విలువైన ప్రపంచ బ్యాంకు నిధులను బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు మహిళలకు రూ.10వేల నగదు బదిలీ చేయడానికి మళ్లించారని, తద్వారా ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు నితీశ్ ప్రభుత్వం ఓట్లను కొనుగోలు చేయడానికి దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.  ఈ చర్య ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడమే అవుతుందని దీనిపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.