12-05-2025 02:02:40 AM
రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. మూడో పాట విడుదలైంది. ‘రాత్రంతా రచ్చే.. మరి నువ్వంటే పిచ్చే.. పద దోస్తీ కడతా.. కుస్తీ పడతా -వలపు వాకిట..’ అంటూ సాగుతోందీ గీతం. చైతన్యప్రసాద్ రచించిన ఈ పాట ను యువన్ శంకర్రాజా, నిత్యశ్రీ ఆలపించారు. యువన్ తెలుగులో తొలిసారి పాడిన పాట ఇదే కావడం విశేషం.