30 June, 2026 | 10:10 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన యూత్ ఫర్ సొసైటీ

05-04-2025 05:16 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మూడవ జోన్ రామాలయం సమీపంలో నివాసముండే నిరుపేద కుటుంబానికి యూత్ ఫర్ సొసైటీ సభ్యులు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి శనివారం 5 వేల రూపాయలు అందచేశారు. ఈ సందర్బంగా సంస్థ సభ్యులు మాట్లాడారు. నిరుపేద కుటుంబానికి చెందిన పాలితపు కుమారస్వామి- భవాని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు అఖిలేష్ గత రెండు నెలల క్రితం శ్రీరాంపూర్ లో గల కళాశాల కు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

ఈ ప్రమాదంలో బాధితుడి వెన్నుపూస, డిస్క్ మెదడు, నరాలు తీవ్ర గాయాలయ్యాయన్నారు. అసలే పేదరికం ఆపై ఇల్లు గడవడం కష్టమవుతున్న పరిస్థితుల్లో కొడుకు తీవ్ర గాయాల పాలవడం కుటుంబానికి ఆర్థికంగా కష్టంగా మారిందని, స్థానికుల ద్వార సమాచారం తెలుసుకొని బాధిత కుటుంబానికి తమ వంతుగా సహాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ సభ్యులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్, సొత్కు ఉదయ్, మంద మహేందర్, చోటు, ఒజ్జ గణేష్, రాజేష్, కళ్యాణ్, చింటూ, సుజిత్, సాత్విక్, మహేష్ లు పాల్గొన్నారు.