మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
16-12-2025
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా(Bijapur District)లో మంగళవారం 34 మంది నక్సలైట్లు(Naxalite) లొంగిపోయారని ఛత్తీస్గఢ్ పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 26 మందిపై మొత్తం రూ. 84 లక్షల రివార్డు ఉంది. ఏడుగురు మహిళలతో సహా ఈ నక్సలైట్లు సీనియర్ పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ నక్సలైట్లు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జెడ్సీ), తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు విభాగంలో చురుకుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.