calender_icon.png 8 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Editorial

article_88676268.webp
జల వివాదాలకు చెక్ పెట్టాలి!

08-01-2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పన్నెండేళ్లు కావొస్తున్నా నీటి వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నా యి. ఇప్పటికే కీలకమైన నదీ జలాల పం పిణీ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు తమ హక్కులు కాపాడుకోవడానికి నిరంతరం పోరాడుతున్నా యి. ఢిల్లీ కేంద్రంగా పంచాయతీలు పెడుతున్నా ఎటూ తేలడం లేదు. తెలుగు నాట గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో ఈ పోరు రావణకాష్టంలా మండుతోంది. ఈ నదీ జలాల్లో ఎవరి వాటా ఎంతా? ఎవ రి మోసం ఏమిటనే విషయాలు కొలిక్కి రావడం లేదు. నిజానికి రాష్ర్టం రెండుగా చీలిన తర్వాత కొత్త నీటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలూ దృష్టి సారించాయి.పెరిగిన అవసరాలు, కనిపిస్తున్న అవకాశాలు ప్రజలకు ఇచ్చిన హామీలు వెరసి కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నా యి. అయితే కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే నికర జలాలు ఎంత? మిగులు జలాల్లో ఎంత వాటా సముద్రంలో కలుస్తుందనే లెక్కలు తేలాల్సి ఉంది.

article_26335918.webp
పది నిమిషాల డెలివరీతో చిక్కులెన్నో!

08-01-2026

నగరాల్లో ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ సర్వసాధారణం అయింది. కేవలం ఒక్క క్లిక్‌తో సరుకులు ఇంటికి చేరుతున్నాయి. ఈ వేగం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. వేగంగా డెలివరీ చేసే క్రమంలో డెలివరీ బా య్స్ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో పని చేస్తున్న వారికి సరైన రక్షణ లభించడం లేదు. భారతదేశంలో గిగ్ ఎకానమీ చట్టాల కంటే వేగంగా విస్తరించింది. ప్రస్తుతం దేశం లో దాదాపు 80 లక్షల మంది గిగ్ కార్మికు లు ఉన్నారు. వీరి సంఖ్య భవిష్యత్తులో ఇం కా పెరిగే అవకాశముంది. డెలివరీ యాప్స్ ద్వారా యువతకు ఉపాధి లభిస్తోంది.

article_71538200.webp
వాయు కాలుష్యాన్ని అరికట్టాలి!

08-01-2026

ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కాలుష్యానికి ప్రధాన కారణాలు.. వాహనాల సంఖ్య పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను కాల్చడం, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణాల నుంచి వెలువడే దుమ్ము, చెత్తను కాల్చడమే. అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఆరావళి పర్వతాలు ఒకటి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్నాయి. థార్ ఎడారి తూర్పుకు విస్తరించకుండా అడ్డుకుంటూ, భూగర్భజలాలను పునరుద్దరిస్తూ, వన్యప్రాణులను సంరక్షిస్తూ, చుట్టూ ఉన్న రాష్ట్రాలకు ప్రాణవాయువును అందిస్తుంది.

article_43150489.webp
ఉన్నావ్ కేసులో న్యాయం గెలిచేనా?

08-01-2026

ఉన్నావ్ అత్యాచార కేసు ప్రధాన ముద్దాయి, బీజేపీ మాజీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పడిన యావజ్జీవ శిక్షను ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేయడం సంచలనం కలిగించింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేరస్థుడి శిక్షను ఏ సందర్భాల్లో సస్పెండ్ చేయవచ్చనే అంశాన్ని చట్టపరంగా విశ్లేషించాల్సి ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ ప్రాంతంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అనేకసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు సెంగార్‌పై కేసు నమోదైంది. బాధితురాలి తండ్రిపై అక్రమ కేసులు పెట్టి, పోలీస్ కస్టడీలోనే దాడి చేయించి ప్రాణాలు తీయించాడు.

article_39983996.webp
టార్గెట్ గ్రీన్‌ల్యాండ్!

08-01-2026

మొన్నటిదాకా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానంటూ బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసు మార్చుకున్నారు. శాంతి అంశాన్ని పక్కనబెట్టిన ట్రంప్ ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాలను తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వెనిజులా దేశంపై దండెత్తడంతో పాటు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను బంధించి న్యూయార్క్‌కు తరలించారు. తాజాగా ట్రంప్ కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. మరో 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడుకుందామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని, అమెరికాలో కలిపేందుకు వీలున్న మార్గాలను పరిశీలించాలని ట్రంప్ తన బృందానికి సూచించారు. అవసరమైతే సైనిక చర్యను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.