వాయు కాలుష్యాన్ని అరికట్టాలి!
08-01-2026
ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కాలుష్యానికి ప్రధాన కారణాలు.. వాహనాల సంఖ్య పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను కాల్చడం, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణాల నుంచి వెలువడే దుమ్ము, చెత్తను కాల్చడమే. అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఆరావళి పర్వతాలు ఒకటి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్నాయి. థార్ ఎడారి తూర్పుకు విస్తరించకుండా అడ్డుకుంటూ, భూగర్భజలాలను పునరుద్దరిస్తూ, వన్యప్రాణులను సంరక్షిస్తూ, చుట్టూ ఉన్న రాష్ట్రాలకు ప్రాణవాయువును అందిస్తుంది.