calender_icon.png 23 January, 2026 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_18562868.webp
కవిత కొత్త పార్టీ.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్

19-01-2026

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ(Kavitha new party) ఏర్పాటులో స్పీడ్ పెంచినట్లు కొడుతోంది. కవిత పార్టీ ప్రారంభించే విషయమై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నారని సోమవారం తెలంగాణ జాగృతి వర్గాలు తెలిపాయి. రెండు నెలల్లో పీకేతో కవిత రెండు సార్లు భేటీ అయ్యారు. సంక్రాంతి వేళ ఐదు రోజులు పాటు మాజీ ఎంపీ కిషోర్‌తో(Prashant Kishor) కవిత సమావేశం అయ్యారు. ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై పీకేతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం చేశారు.

article_71831539.webp
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదాలు

17-01-2026

మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలను ఉల్లంఘించడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ కోరారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్ర మంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని పేర్కొంటూ, ఇం దుకోసం పోలీస్ ఉద్యోగులు ముందుగా రో డ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రా ఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించారు.

article_21864785.webp
పట్నాన్ని తలపిస్తున్న మేడారం

11-01-2026

మేడారం, జనవరి 10 (విజయక్రాంతి): మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో మేడారం పట్టణాన్ని తలపిస్తోన్నది. రూ.101 కోట్లతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువయ్యే జాతర గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించారు. మేడారం నలువైపులా నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించారు. జంపన్న వాగులో శాశ్వత ప్రాతిపదికన పనులు చేశారు. విద్యుత్, తాగునీరు, మెరుగైన రవాణా, వసతి సౌకర్యం ఏర్పాట్లు చేశారు. జంక్షన్‌లను గిరిజన సంప్రదాయం ఉట్టిపడే విధంగా కళాకృతులు ఏర్పాటుచేసి సుందరీకరిం చారు. దీంతో ములుగు నుంచి మేడారం వరకు తాడ్వాయి, జంగాలపల్లి జంక్షన్ల వద్ద ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరు గడించి, కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి సరికొత్త మురిపం సంతరించుకుని.. భక్తజనకోటికి ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు స్వాగతం పలుకనుంది. తరలివచ్చే అశేషజనవాహనిని ఆధ్యాత్మికతతో కనువిందు చేయనుంది.

article_14743250.webp
ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ అరెస్ట్

07-01-2026

హైదరాబాద్: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌ సునీల్ కుమార్‌ను(Orange Travels MD arrested) జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. అధికారిక వర్గాల ప్రకారం, కంపెనీ రూ.28 కోట్ల జీఎస్టీని ఎగవేసింది. అరెస్టు అనంతరం, తదుపరి న్యాయపరమైన చర్యల కోసం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు(GST intelligence officers) తమ దర్యాప్తులో అతని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. తెలంగాణవ్యాప్తంగా జీఎస్టీ(Goods and Services Tax) ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.

article_61203123.webp
బెజ్జూర్ లో ఆసుపత్రి మంజూరు చేయాలి

05-01-2026

బెజ్జూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వం 30 పడగల ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారే తప్ప ఆసుపత్రి నిర్మాణం నోచుకోలేదని అన్నారు. ఆసుపత్రిలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని,నూతన ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు.