08-09-2025
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మానవాళిని గజగజలాడిస్తూ పెనుసవాల్ విసురుతున్న క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ రానుంది. క్యాన్సర్ వ్యాధిని వందశాతం నివారించే వ్యాక్సిన్ను తయారు చేసినట్టు రష్యా ప్రకటించింది. సూది మందు రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్ను త్వరలోనే విపణిలోకి విడుదల చేయనుంది. అత్యంత భయానకమైన క్యాన్సర్ వ్యాధికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. క్యాన్సర్ రోగుల కోసం ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ తయారు చేసినట్టు రష్యా పేర్కొంది.
03-09-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది. కేవలం 28 వారాల గర్భధారణకే 860 గ్రాముల బరువుతో జన్మించిన శిశువును విజయవంతంగా చికిత్స చేసి, ఆరో గ్యంగా డిశ్చార్జ్ చేసింది. ఎస్ఎస్సహెచ్హెచ్ నిజాంపేట్లో ఎమర్జెన్సీ రూంలో పుట్టిన శిశువును అత్యంత క్లిష్ట పరిస్థితిలోనే మొదటి రోజే కొండాపూర్లోని బ్రాంచీకి తరలించారు.
31-08-2025
కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులకు రోగ లక్షణాలు పూర్తిగా పైకి కనిపించవు. దాంతో రోగ నిర్ధారణ కూడా సరిగా జరగకపోవచ్చు. ఎప్పుడైతే రోగ నిర్ధారణ సరిగ్గా జరగదో సహజంగానే సరియైన వైద్యం కూడా పొందలేరు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు కూడా అన్నీ ఒక్కోసారి నార్మల్గానే ఉండవచ్చు.
30-08-2025
ముషీరాబాద్, ఆగస్ట్ 29 (విజయ క్రాంతి) : అధిక చెక్కర వినియోగంతో దంతాలకు నష్టం వాటిల్లు తుందని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ సోనియా దత్తా శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక చెక్కర వినియోగం మన నోటి ఆరోగ్యంపై హానికర మైన ప్రభావాలను చూపుతుందని తెలిపారు. డాబర్ రెడ్ పేస్ట్ వంటి విశ్వసనీయ టూత్పేస్ట్ దాని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుందని తెలిపారు.
29-08-2025
భారతదేశ ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలపై 50 శాతం యుఎస్ సుంకాల(US tariffs) ప్రభావంపై ఉద్రిక్తత మధ్య, భారత రూపాయి అమెరికా డాలర్తో(US Dollar ) పోలిస్తే 87.97కి పడిపోయింది. ఈ వారం నుండి అమలు చేయబడుతున్న కొత్త యుఎస్ సుంకాల కారణంగా భారత కరెన్సీ ఒత్తిడిలో ఉంది. అయితే, ఫిబ్రవరిలో దాని మునుపటి ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 87.9563 ను అధిగమించి, డాలర్తో పోలిస్తే కరెన్సీ 0.4శాతం తగ్గి 87.9763 కు చేరుకుంది. ఈ సంవత్సరం, స్థానిక ఈక్విటీల నుండి నిరంతరం విదేశీ ఉపసంహరణల కారణంగా రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. అమెరికా సుంకాలను ప్రధానంగా వస్త్రాలు, పాదరక్షలు, ఆభరణాలు వంటి ఎగుమతి-ఆధారిత పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని పెంచింది.
24-08-2025
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైటెక్సిటీ మెడికవర్ హాస్పి టల్స్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని టీహబ్లో ఎలివేట్ ఈఎన్టీ సమ్మి ట్2025 రెండో ఎడిషన్ను నిర్వహించా రు. ‘రైనాలజీ అండ్ స్కల్ బేస్ సర్జరీ: ఫండమెంటల్స్ టు ది ఫ్రంటియర్’ అనే ఇతివృ త్తంతో రెండురోజుల పాటు సీఎమ్ఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రా మ్కు మెడికవర్ రూపకల్పన చేసింది.